షాకింగ్; మారుతి రావుది హత్యా…?

-

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ళ క్రితం ఒక హత్యతో సంచలనం సృష్టించిన మారుతి రావు… ఇప్పుడు తన ఆత్మహత్యతో ఎన్నో ప్రశ్నలను మిగిల్చి వెళ్లారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఎం జరిగింది అనేది ఎవరికి తెలియడం లేదు. పోలీసులు ఎంత ఆరా తీస్తున్నా, ఎవరిని విచారిస్తున్నా కనీస ఆధారాలు కూడా పట్టుకోలేకపోతున్నారు అనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఇక్కడ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా కూడా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు జనాలు. ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఆయన అలా ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఏదైనా ఆధారం దొరకాలి. పురుగుల మందు కొన్నట్టు సమాచారం ఉంది గాని ఆధారాలు మాత్రం దొరకడం లేదు.

ఇక అది పక్కన పెడితే ఆయన సరిగ్గా సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ఆర్య వైశ్య భవన్‌కు వెళ్లి… తర్వాత డ్రైవర్‌ను కిందికి పంపి గారెలు తెప్పించుకుని తిన్నాడు. అయితే వెంటనే వాంతులు అయినట్టు ఆధారాలు గుర్తించారు పోలీసులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గదిలో నుంచి ఒకసారి బయటకు వచ్చారని, అప్పుడు ఎవరిని అయినా కలిసారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆయన ఆహారంలో ఏమైనా కలుపుకుని తిని ఉంటారా అనేది కూడా తేలాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఏమైనా స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news