అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తానా బోర్డు సభ్యుడి భార్య, కుమార్తెలు దుర్మరణం

-

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మృతులు కృష్ణా జిల్లాకు చెందిన తానా బోర్డు సభ్యుడు కొడాలి నాగేంద్ర శ్రీనివాస్​ భార్య, ఇద్దరు కుమార్తెలుగా అమెరికా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌ హ్యూస్టన్‌‌లో నివాసం ఉంటున్నారు.. భార్య వాణి ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు కుమార్తెల్లో.. పెద్ద కూతురు వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది.

దసరా పండుగ కోసం పెద్ద కుమార్తెను తీసుకురావడానికి కళాశాలకు.. వాణీ, ఆమె చిన్న కుమార్తె వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంపై తానా సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌కు నాట్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news