అదిరే పోస్టల్ స్కీమ్…ఏకంగా రెట్టింపు డబ్బులు..!

-

ఈ మధ్య చాలా మంది ఎన్నో స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ గురించి చూడాలి. ఈ స్కీమ్ తో అదిరే లాభాలను పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో మంచిగా లాభాలు వస్తాయి.

ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయి. రూ.1000 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మీరు ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టొచ్చు. రూ.50 వేలకు పైగా ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

ఈ స్కీమ్ కింద ప్రతీ ఏడాది 6.9 శాతం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున వడ్డీ ఇస్తున్నారు. ఇక ఎవరు ఇన్వెస్ట్ చెయ్యచ్చు అనేది చూస్తే.. 18 ఏళ్లుపైబడిన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రెండున్నరఏళ్లు పైబడిన తర్వాత పెనాల్టీ లేకుండా డబ్బులను తీసుకోవచ్చు. వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది. ఏడాది నుంచి రెండున్నర సంవత్సరాల లోపు తీసుకోవాలనుకుంటే తక్కువ వడ్డీ వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news