థాయిలాండ్‌ డే కేర్‌లో 34 మందిని చంపిన మాజీ పోలీస్ ఆత్మహత్య..!

-

థాయిలాండ్‌లోని డే కేర్‌ సెంటర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నాక్లాంగ్‌ జిల్లా నాంగ్‌బు నాంఫూ పట్టణంలోని ఓ డే కేర్‌ సెంటర్‌లో బహిరంగ కాల్పులు జరిపిన పాన్య ఖమ్రాఫ్‌ అనే మాజీ పోలీస్‌ అధికారి తన కుటుంబాన్ని కూడా చంపి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడినట్టు థాయిలాండ్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

గురువారం మధ్యాహ్న సమయంలో డే కేర్‌ సెంటర్‌లోకి ప్రవేశించిన నిందితుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 23 మంది చిన్నారులతో పాటు మొత్తం 34 మంది మృతి చెందారు. మృతుల్లో రెండేళ్ల వయసు చిన్నారులే ఎక్కువ మంది ఉండటం అందరినీ హృదయాలను తీవ్రంగా కలచివేసింది.

ఈ ఘటనలో ఎనిమిది మాసాల గర్భిణిగా ఉన్న ఓ టీచర్‌తో పాటు నలుగురైదుగురు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి జిల్లా అధికారి జిడపా బూన్సమ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 26 మంది మృతదేహాలను గుర్తించామని.. వీరిలో 23మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు, ఒక పోలీస్‌ అధికారి ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు.

వీరందరిని దారుణంగా హతమార్చిన నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ప్రధాని కూడా అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మారణహోమానికి తెగబడిన అనంతరం ఘటనా స్థలం నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్న నిందితుడు తన భార్య పిల్లల్ని కూడా చంపేసి ఆ తర్వాత  ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news