సిద్దిపేట జిల్లాలో దారుణం..ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య

-

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని, ప్రియుడి కోసం భర్తను కడతేర్చింది ఓ భార్య. అయితే.. ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన.. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల, దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన కోనాపురం చంద్రశేఖర్ కు మార్చ్ 23న వివాహం జరిగింది. పెళ్లికి ముందే అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో శ్యామలకు ప్రేమ వ్యవహారం ఉంది.

ఈ నేపథ్యంలోనే భర్తను అడ్డు తొలగించుకునేందుకు గతంలో విష ప్రయోగం చేయగా..అది విఫలం అయింది. దీంతో ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి మరోసారి హత్యకు కుట్ర చేసింది.. ఏప్రిల్ 28న చిన్నకోడూర్ మండలం ఆనంతసాగర్ క్షేత్రంలో మొక్కు ఉందని భర్తను నమ్మించి తీసుకెళ్లిన శ్యామల… అనంతసాగర్ శివారు బ్రాహ్మణ అగ్రహారం సొసైటీ దారిలో ప్రియుడు శివ, అతని స్నేహితులు నలుగురితో కలిసి గొంతు నులిమి హత్య చేశారు.

సిద్దిపేటలో దైవ దర్శనానికి రాగా.. గుండెపోటు వచ్చి చనిపోయాడని నమ్మించింది భార్య. అయితే.. పోస్టుమార్టం లో గొంతు నులిమి చంపినట్లు వెల్లడైంది.దీంతో ఈ కేసులో భార్య శ్యామల, ఆమె ప్రియుడు శివ, గుడికందుల గ్రామనికే చెందిన రాకేష్, రంజిత్ లతో పాటు, హత్యకు సహకరించిన సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి గ్రామానికి చెందిన భార్గవ్, పొత్తురు కు చెందిన సాయి కృష్ణలను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు సిద్దిపేట టూ టౌన్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news