ఇంట్లో దొంగ‌తనం చేయ‌డం కోసం.. ప్లాట్ కొని సొరంగం త‌వ్వారు..!

-

టైటిల్ చ‌దివితేనే అచ్చం ఏదో మూవీలో చూసిన‌ట్లు అనిపిస్తుంది క‌దా. అవును.. స‌రిగ్గా అక్క‌డ కూడా అలాగే జ‌రిగింది. కొంద‌రు దొంగ‌లు ఒక వ్య‌క్తి ఇంట్లో దొంగ‌త‌నం చేసేందుకు గాను ఏకంగా అత‌ని ఇంటి ప‌క్క‌న ఉన్న ప్లాట్‌ను భారీ ధ‌ర‌కు కొన్నారు. త‌రువాత ఎంతో క‌ష్ట‌ప‌డి నెల‌ల పాటు శ్ర‌మించి సొరంగం త‌వ్వారు. అనంత‌రం సొరంగం కూడా ఆ వ్య‌క్తి ఇంట్లోకి ప్ర‌వేశించి అత‌ని ఇంట్లో ఉన్న సొత్తును దోచేశారు. సినీ ఫ‌క్కీలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది.

thieves dig tunnel and theft silver in doctors house

జైపూర్‌లోని వైశాలిన‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉండే డాక్ట‌ర్ సునీత్ సోనీ ఇంటి ప‌క్క‌నే కొంద‌రు వ్య‌క్తులు రూ.90 ల‌క్ష‌లు పెట్టి మ‌రీ కొన్ని నెల‌ల కింద‌ట ఓ ప్లాట్ కొన్నారు. త‌రువాత ఆ ప్లాట్ నుంచి డాక్ట‌ర్ ఇంట్లోకి వ‌చ్చేట్లుగా ఓ సొరంగం తవ్వారు. ఈ క్ర‌మంలో డాక్ట‌ర్ ఇంట్లో లేని స‌మ‌యం చూసి ఆ సొరంగం కూడా వారు డాక్ట‌ర్ ఇంట్లోకి ప్ర‌వేశించి అత‌ని ఇంట్లో ఓ బాక్సులో భారీ మొత్తంలో ఉన్న వెండిని చోరీ చేశారు.

కాగా ఈ చోరీపై ఆ డాక్ట‌ర్ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే దొంగిలించ‌బ‌డిన వెండి ఆ ప్లాట్ ఖ‌రీదు రూ.90 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువా, త‌క్కువా.. అనే వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. కానీ భారీ మొత్తంలోనే సొత్తు ఉంటుంద‌ని తెలుస్తోంది. లేదంటే వారు అంత పెద్ద మొత్తంలో ప్లాట్‌కు వెచ్చించి త‌క్కువ ఖ‌రీదు ఉండే వెండిని దొంగిలించ‌రు క‌దా. ఏది ఏమైనా.. ఈ సంఘ‌ట‌న చ‌దివితే ఓ చిన్న సినిమా చూసిన‌ట్లే ఉంది క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news