భార్య‌ను కాపాడ‌బోయి బ‌లైన భ‌ర్త‌

-

క‌రెంట్ షాక్ త‌గిలిన భార్య ను కాపాడ‌బోయి భ‌ర్త ప్రాణాల‌ను వ‌దిలేశాడు. ఈ ఘ‌ట‌న మహ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా లోని బ‌య్యారం మండలం లో గ‌ల గంధం ప‌ల్లి లో జ‌రిగింది. భార్య బ‌ట్ట‌లు ఆరేస్తుండ‌గా క‌రెంట్ షాక్ త‌గ‌లడం తో భార్త కాపాడ‌బోయాడు. దీంతో భ‌ర్త కు కూడా షాక్ త‌గిలింది. వివ‌రాల‌కు వెళ్తే గంధం ప‌ల్లి గ్రామంలో తిరుప‌త‌మ్మ (27) ఉపేంద‌ర్ (30) దంప‌తులు నివాసం ఉంటున్నారు. అయితే శ‌నివారం భార్య తిరుప‌త‌మ్మ బ‌ట్ట‌లు ఉతికి ఆరేసే స‌మ‌యంలో క‌రెంట్ షాక్ త‌గిలింది.

దీంతో పక్క‌నే ఉన్న భ‌ర్త ఉపేంద‌ర్ భార్య ను ర‌క్షించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో భ‌ర్త కు కూడా షాక్ త‌గిలింది. ఇద్దరిని స్థానికులు కాపాడి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగ మార్గ మ‌ధ్య‌లో ఇద్ద‌రు దంప‌తులు ప్రాణాలు కొల్పోయారు. దీంతో ఒకే కుటుంబం నుంచి దంపతులు ఇద్ద‌రూ ప్రాణాలు కొల్పోవ‌డం తో గ్రామం లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news