ప్రియుడితో కలిసి భర్త తలను నరికేసి.. !

-

Wife kills husband with her lover in madhya pradesh

ఇది అత్యంత దారుణమైన ఘటన. బంధాలు, బాంధవ్యాలు అనేవి లేకుండా మనుషులు సాగిస్తున్న వికృత క్రీడ ఇది. సొంత వాళ్లనే మట్టుపెడుతూ పైశాచికానందం పొందుతున్నారు నేటి మనుషులు. అక్రమ సంబంధం, డబ్బు, ఇతర అవసరాల కోసం సొంత వాళ్లను కూడా ఏమాత్రం ఆలోచించకుండా మట్టుపెట్టేస్తున్నారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా అటువంటిదే.

మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల భూప్ సింగ్‌కు రజినీ అనే యువతితో పెళ్లి జరిగింది. అయితే.. పెళ్లి తర్వాత వీళ్లు పని కోసం ఝాన్సీ పట్టణానికి వెళ్లిపోయారు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. ఇంతలోనే రజినీకి ఝాన్సీలో అనిరుధ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో పరిచయం అయిన కొన్ని రోజులకే భర్తను, కొడుకును వదిలేసి అనిరుధ్‌తో నోయిడా వెళ్లిపోయింది.

తర్వాత భూప్‌సింగ్ నోయిడా వెళ్లి రజినీని బతిలాడి మధ్యప్రదేశ్‌కు తీసుకొచ్చాడు. భూప్‌సింగ్‌తో ఉండటం ఇష్టం లేక ఎలాగైనా అతడిని అంతమొందించాలని ప్లాన్ వేసింది రజినీ. ప్రియుడిని అక్కడికి పిలుచుకొని పక్కా ప్లాన్ వేసి అతడిని చంపాలని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం ఓరోజు భూప్‌సింగ్‌కు ఇద్దరూ ఫుల్లుగా మద్యం తాగించారు. అనంతరం పదునైన కత్తితో అతడి తలను నరికారు. తలను, మొండాన్ని వేరు చేసి.. తలను ఒకచోట.. మొండాన్ని మరోచోట పడేశారు. ఈ ఘటన జరిగింది నవంబర్ 30న.

అతడిని హత్య చేసిన ఓ నాలుగు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది రజినీ. దీంతో పోలీసులు భూప్‌సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 9న కుళ్లిపోయిన తలలేని మొండెం పోలీసులకు దొరికింది. ఆ మొండాన్ని చూసిన భూప్‌సింగ్ సోదరుడు.. భూప్‌సింగ్ మృతదేహమేనని తెలిపాడు. దానిపై విచారణ చేపట్టిన పోలీసులు.. భూప్‌సింగ్ భార్యను కూడా అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూప్‌సింగ్‌ను తన ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్టు రజినీ పోలీసుల ముందు ఒప్పుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news