ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య!

-

ప్రేమించింది.. అతడితో జీవితాంతం బతకాలని అనుకుంది. కానీ.. వారి పెళ్లికి కుటుంబ సభ్యలు ఒప్పుకోలేదు. దీంతో తనువు చాలించుకోవాలనుకుంది. తన కంటే ముందే తనను ప్రేమించిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడులో చోటు చేసుకున్నది. గుడిపాడుకు చెందిన తిరుపతమ్మ అదే ఊరుకు చెందిన నాగసురేశ్ ను ప్రేమించింది. వాళ్ల పెళ్లికి ఇరు కుటంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఈ నెల 21 న నాగ సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం తిరుపతమ్మ కూడా ఎలుకల మందును కూల్ డ్రింక్స్ లో కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నది.

అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… తిరుపతమ్మకు చెల్లలి వరుస అయిన రవళి కూడా తిరుపతమ్మతో కలిసి ఆత్మహత్య చేసుకున్నది. తన తల్లి మందలించిందని దీంతో మానసిక ఒత్తిడికి గురైన రవళి తిరుపతమ్మతో పాటు ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు యువతులు ఒకేసారి వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news