Breaking : ఉద్యోగాల భ‌ర్తీపై సీఎస్ స‌మీక్ష.. అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శులు హాజ‌రు

-

తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే 80 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ముఖ్య మంత్రి కేసీఆర్.. అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని శాఖ‌ల‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాల‌ను సైతం విడుద‌ల చేశారు. జిల్లాలు, జోన‌ల్, మ‌ల్టీ జోన‌ల్ లో చొప్పున‌ ఉన్న ఖాళీల వివ‌రించారు. అతి త్వ‌ర‌లోనే ఉద్యోగ భ‌ర్తీకి నోటిఫికేషన్లు విడుద‌ల అవుతాయ‌ని కూడా ప్ర‌క‌టించారు.

కాగ ఈ నేప‌థ్యంలో కాసేప‌టి క్రితం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్.. అన్ని శాఖల ఉన్న‌త అధికారులు, కార్య‌ద‌ర్శుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ తో పాటు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ఉన్న‌త అధికారులు హజ‌రు అయ్యారు. అలాగే విద్య, వైద్య శాఖ‌ల‌తో పాటు హోం శాఖ నుంచి కూడా ఉన్న‌త అధికారులు, కార్య‌ద‌ర్శులు ఈ స‌మావేశానికి హ‌జ‌రు అయ్యారు. కాగ ఈ స‌మావేశంలో ఉద్యోగాల భ‌ర్తీ పై మ‌రో ముంద‌డుగు వేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news