IPL 2023 : ఐపీఎల్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ధోని గాయం పై CSK కీలక ప్రకటన

-

ఇవాళ్టి నుంచే ఐపీఎల్ 16వ సీజన్ మొదలుకానుంది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీ కొడుతుంది. గతేడాదే లీగ్‌లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గాయం కారణంగా ఈరోజు ప్రాక్టీస్ సెషన్ కు దూరం కావడంతో ఇవాళ గుజరాత్ తో జరిగే IPL ఓపెనింగ్ మ్యాచ్ కు అందుబాటుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో CSK సీఈవో విశ్వనాథన్ స్పందించారు. ‘నాకు తెలిసిన సమాచారం ప్రకారం ధోని ఇవాళ కచ్చితంగా మ్యాచ్ ఆడతారు. ఆపైన అప్డేట్ గురించి తెలీదు’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news