మూడు ముక్కలుగా నరికి వేసి… మురికి కాలువలో పడేశారు

-

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్​ గ్రామానికి చెందిన సత్తిపల్లి రాజు(35)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాజును మూడు ముక్కలుగా నరికి అతని ఇంటి సమీపంలోని కాల్వలోనే పడేశారు. గ్రామంలోని టెంట్​హౌస్​లో పనిచేసే రాజు నాలుగు రోజులుగా కనిపించలేదు. గతంలోనూ తరచూ ఇలా జరగడం వల్ల అతని తల్లి పార్వతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

crime
crime

మంగళవారం.. రాజు ఇంటి సమీపంలోని మురికి కాల్వలో ఓ చోట తల, మరో చోట మొండెం, ఇంకో చోట కాళ్లు పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాజు అదృశ్యమైన రోజే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. చివరి సారిగా అతనితో కలిసి మద్యం సేవించిన వ్యక్తే రాజు హత్యకు కారణమై ఉంటాడని భావిస్తున్నారు. పూర్తిగా దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news