రాష్ట్రంలో డేంజ‌ర్ బెల్స్ .. నేడు 4,416 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుత‌న్నాయి. ఈ రోజు కూడా క‌రోనా కేసులు నాలుగు వేల మార్క్ దాటాయి. నిన్న‌టి తో పోలిస్తే.. 200 కేసులు పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం.. ఈ రోజు 4,416 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 7,26,819 కేసులు న‌మోదు అయ్యాయి.

అలాగే ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా బారిన ప‌డ్డి ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కాటుకు బ‌లైన వారి సంఖ్య 4,069 కి చేరింది. కాగ ఈ రోజు 1,920 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కొలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,93,623 కు చేరుకుంది. కాగ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీలో క‌రోనా ఉధృతి మాత్రం ఆగ‌డం లేదు. జీహెచ్ఎంసీలో ఈ రోజు కూడా 1,670 కేసులు వెలుగు చూశాయి.

Read more RELATED
Recommended to you

Latest news