టీఆర్ఎస్ రెబల్ నేత దయాకర్ రెడ్డికి.. కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

-

మున్సిపాలిటి, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మరోసారి తన సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి… ఆ పార్టీ రెబల్ నేతకు కాంగ్రెస్ కండువా కప్పారు. దయాకర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అనుచరుడిగా కొనసాగుతోన్నారు. ఆయన మల్కాజ్ గిరి పరిధిలోకి వచ్చే పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పరిధి ఆశించారు. దీనికి టీఆర్ఎస్ అదిష్ఠానం అంగీకరించకపోవడంతో దయాకర్ రెడ్డి పార్టీని వీడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

అంతేకాదు స్వయంగా దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని కోరారు. ఆయనకు కాంగ్రెస్ తరపున బీ ఫామ్ కూడా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తుందన్నారు. మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. డబ్బులతో, అక్రమ కేసులతో రాజకీయాలు చేయానుకునేవారికి తాజా పరిణామాలు కనువిప్పు అని పేర్కొన్నారు. పీర్జాదిగూడలో కాంగ్రెస్ గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ వార్డులన్నింటినీ సొంతం చేసుకుంటుందన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news