రాష్ట్ర చిహ్నం మార్పుపై దాసోజు శ్రవణ్ ఫైర్

-

దేశవ్యాప్తంగా ఏ పార్టీ వారు గెలుస్తారని చర్చ జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పుపై రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న చిహ్నం, గేయాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది..

ఈ క్రమంలోనే అధికారిక చిహ్నాం మార్పు టాపిక్‌పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. బుధవారం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ చార్రితక ఆనవాళ్లను తుడిచే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతీసారి ప్రభుత్వ గుర్తులు, పేర్లు మార్చడం సరికాదని ఆయన హితవు పలికారు.ఇప్పుడు చిహ్నాం మారుస్తోన్న రేవంత్ రెడ్డి సీఎం పదవి నుండి దిగిపోవాల్సి వస్తే కొత్త సీఎం మరో కొత్త లోగో తెస్తారా అని ప్రశ్నించారు. ఒక వేళ రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్చాల్సి వస్తే ప్రజలను ఒప్పించి.. మెప్పించాలని , అన్ని వర్గాల సంప్రదింపులతో పాటు అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news