దారుణం : అమ్మా నాన్నను మర్డర్ చేసిన కన్నకూతురు..

-

రోజు రోజుకీ మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతున్నాయి. డబ్బు కోసం సొంత వాళ్ళను కూడా చంపుకోడానికి ఎవరూ వెనకాడడం లేదు. నిన్న తెలంగాణాలో ఆస్తి కోసం ఒక కొడుకు తల్లిని చంపడానికి విశ్వప్రయత్నం చేయగా ఒక కూతురు తల్లి అప్పు తీర్చమని అడిగిందని ఆమెను గొంతు కోసి చంపింది. ఇక ఈరోజు కూడా ఆంద్ర ప్రదేశ్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

murder
murder

ఏపీలోని జగ్గయ్యపేట మండలం లోని బండి పాలెం లో దారుణం జరిగింది. ఆస్తి కోసం దారుణంగా వృద్ధ దంపతులను కన్న కూతురు – అలుడు హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వారు   పాట ముత్తయ్య సుగుణమ్మలుగా పోలీసులు  గుర్తించారు. హత్య చేసిన బాబురావు, మనీషా  లను  అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. ఇక బాబూరావు వార్డు వాలంటిరుగా పనిచేస్తున్నట్టు సమాచారం.  

 

Read more RELATED
Recommended to you

Latest news