ఏపీలో ఆ ఒక్క ప్రాంతంలో భయంకరంగా పరిస్థితి…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఫలించడం లేదు. ఇక ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రు నగర్ లో మరణ మృదంగం భయపెడుతుంది. 10 రోజుల వ్యవధిలో 18 మంది మృతి చెందారు. వాంతులు, విరోచనాలు, గుండె ఆగిపోవడం వంటి లక్షణాలతో మృతి చెందారు.

రోజు మరణాలతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా కారణమా, కలుషిత నీరు కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరణాలకు కారణమేంటో తేల్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే నెహ్రు నగర్ లో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల నేపథ్యంలో టెస్ట్ చేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news