త్వరలో వరంగల్ లోక్ సభ అభ్యర్థిపై నిర్ణయం: కేసిఆర్

-

మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి .ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఇప్పటికే వ్యూహాలను రచిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులు పోటీ చేసే జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తెలంగాణకు సంబంధించిన కొందరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు.

మిగతా పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన జాబితాను ప్రకటించే దిశగా ముందు అడుగులు వేస్తున్నారు కేసీఆర్.ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో కేసిఆర్ సమావేశం ముగిసింది. ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేశ్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదించారు .కానీ ఆరూరి రమేష్ పోటీకి విముఖత చూపించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎంపీ దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు ఇక దీనికి వదిలిస్తూ కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుందామని ఎంపీ దయాకర్ రావు కి తెలిపారు. అనవసర నిర్ణయాలతో భవిష్యత్తు పాడు చేసుకోవద్దని పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న ఆరూరి రమేష్ కి కెసిఆర్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news