IND VS SL : అంపైర్‌ను బండ బూతులు తిట్టిన టీమిండియా క్రికెటర్

-

 

నిన్న శ్రీలంకతో మ్యాచ్ లో భారత్ గెలవడంలో దీపక్ హుడా కీలక పాత్ర పోషించాడు. 23 బంతుల్లో 41 రన్స్ చేసి ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అయితే బ్యాటింగ్ సందర్భంగా దీపక్ చాలా అగ్రేసివ్ గా కనిపించాడు.

18వ ఓవర్ లో బాల్ వైడ్ వెళ్లిన ఇవ్వలేదంటూ అంపైర్ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. బూతులు తిట్టాడు. దీంతో దీపక్ పై నెటిజెన్లు మండిపడుతున్నారు. అంపైర్ లను గౌరవించడం నేర్చుకో అని హితవు పలుకుతున్నారు. కాగా, శ్రీలంకతో మూడు టీ 20ల సిరీస్ లో టీం ఇండియా శుభారంభం చేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టి20 జట్టు మంగళవారం తొలి టీ20 లో రెండు పరుగుల తేడాతో లంకను ఓడించింది.

Read more RELATED
Recommended to you

Latest news