Delhi : బిభవ్ కుమార్‌ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

-

ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి 500 పేజీల చార్జ్ షీట్‌ను ఢిల్లీ పోలీసులు తీస్ హజారీ కోర్టులో దాఖలు చేశారు. దీనిలో దాదాపు 50 మంది సాక్షుల వాంగ్మూలాలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపింది.బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్నటువంటి కోర్టు బిభవ్ కుమార్‌ను ఈనెల 30న భౌతికంగా తమ ముందు హాజరు పరచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జులై 30వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.

మే 13న ఢిల్లీలో సీఎం అధికారిక నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ మలివాల్‌పై కుమార్ దాడికి పాల్పడ్డారని ప్రధాన ఆరోపణ. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం తప్పుడు నిర్బంధం, మహిళపై దాడి చేయడం వంటి పలు సెక్షన్ల కింద బిభవ్ కుమార్‌ పై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news