పోలీసులపై హోమ్ మినిస్టర్ అనిత ఫైర్.. కారణమేంటంటే..?

-

బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో పెట్టిన ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశింశారు.తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే హత్య కేసు పెట్టి పోలీసులు వేధింపులకు గురిచేసిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. నల్లపాడుకు చెందని శంకరలీలా తన కుమార్తెను కిడ్నాప్ చేశారని నల్లపాడు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేసిన శంకర లీలాపై హత్య కేసు పెట్టి నల్లపాడు పోలీసులు వేధింపులకు గురిచేశారు. 2 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సంఘటనపై ఈ రోజు సచివాలయంలో హోంమంత్రిని కలిసి శంకరలీలా తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేసి పోలీసులు వేధించారని కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ,వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని గుంటూరు పోలీసు ఉన్నతాధికారులకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news