ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్..

-

ఢిల్లీ లో నిన్న జరిగిన అల్లర్ల దృష్ట్యా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఎర్రకోట వద్ద కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ అల్లర్ల ఘటనలో మొత్తం 35 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఢిల్లీ లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు.

.ఢిల్లీలోని ఎర్రకోట, జామా మసీదు అలాగే అన్ని మెట్రో స్టేషన్లు మూసివేశారు. మరో పక్క సింగ్ బోర్డర్ వద్ద రైతులు ఆందోళన కొనసాగుతోంది. అయితే రైతులు శిబిరాల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. నిన్నటి అల్లర్ల ఘటనలో మొత్తం 86 మంది పోలీసులకు గాయాలయ్యాయి అని గుర్తించారు. వారందరికీ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news