వైరల్‌ : ఢిల్లీలో దారుణం.. ముగ్గురు మహిళలను కర్రలతో కొట్టిన గ్యాంగ్‌

-

దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి సంఘటన జరిగినా.. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారుతుంది. పదేళ్లు క్రితం జరిగిన… నిర్భయ సంఘటన అనంతరం… ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. దేశ రాజధాని అయినప్పటికీ.. అక్కడ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా మరో దారుణ సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఢిల్లీలోని.. షాలిమార్‌బాగ్‌లో ముగ్గురు మహిళలపై ఓ గ్యాంగ్‌.. దాడి చేసింది.

కర్రలతో ఆ మహిళలపై దాడులు చేసి.. వారి కడుపులో తన్నారు. ఈ అత్యంత ప్రమాదకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే.. సంఘటన పది రోజుల కింద అంటే.. నవంబర్‌ 19 వ తేదీన చోటు చేసుకుంది. ఈ దాడిలో గాయపడిన ఓ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. ఇక ఈ ఘటనకు సంబంధించిన.. వీడియోను పోలీసులు విడుదల చేశారు. కారు దిగిన ఆ ముగ్గురు మహిళలను… ఓ గ్యాంగ్‌ దారుణంగా కొట్టడం మనకు కనిపించింది. ప్రస్తుతం ఆ ముఠా కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news