విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

-

రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా గృహ జ్యోతి  స్కీమ్ అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క    గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ మండలిలో ఆయన మాట్లాడుతూ.. గృహా జ్యోతి స్కీమ్ కి అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమమని.. అప్లై చేసుకోని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. గృహా జ్యోతి స్కీమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని, గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. అలా వచ్చిన దరఖాస్తులను వడబోసి అర్హత కలిగిన వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news