ఉక్రెయిన్‌ లో 74 సైనిక కేంద్రాలు ధ్వంసం : రష్యా ప్రకటన

-

రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక చర్య ఆదేశాలతో గురువారం ఉదయం నుంచి వైమానిక దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దేశంలోని 11ఎయిర్ ఫీల్డ్ లతో… సహా 75 కి పైగా సైనిక స్థావరాలను తమ సైన్యం ధ్వంసం చేసినట్లు రష్యా ప్రభుత్వం ప్రకటన చేసింది.

ఓ ఉక్రెయిన్ సైనిక హెలికాప్టర్ తో పాటు నాలుగు డ్రోన్లను కూల్చివేసిన ఇంటిని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడికి పాల్పడింది. అయితే రష్యా దాడులను తాము పెట్టిన ప్రతి గటిస్తున్నట్లు ఉక్రెయిన్ కూడా తెలుపుతోంది.

ఉదయం పుతిన్ మిలటరీ ఆపరేషన్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే… రాజధాని కీవ్ తో పాటు అనేక ఇతర నగరాల్లో బాంబు పేలుళ్లు వినిపించాలని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 68 మంది సైనికులు అలాగే పౌరులు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం చేశాయి. ఇక అటు ఉక్రెయిన్ దేశానికి అండగా నిలుస్తోంది అమెరికా దేశం.

Read more RELATED
Recommended to you

Latest news