IPL : మార్చి 26 నుంచే ఐపీఎల్..పూర్తి షెడ్యూల్‌ ఇదే

-

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ పాలకమండలి శుభ వార్త చెప్పింది. గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లీగ్ షెడ్యూల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుందని బీసీసీఐ ప్రకటించింది. మే 29వ తేదీన అహ్మదాబాదులో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తొలి ముగియనుంది.

ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ ముగిసిన 11 రోజుల తర్వాత ప్రారంభం కానున్న ఐపీఎల్ ఈసారి మొత్తం మ్యాచ్లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్ లో గతం కంటే రెండు రెట్లు ఎక్కువగా చేరడంతో లీగ్ మ్యాచులు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇక లీగ్ మ్యాచ్ లన్నీ మహారాష్ట్రలోని జరుగనున్నాయి.

ముంబై, పూణేలోని 4 స్టేడియంలో జరుగుతాయి. ముంబై 50 మ్యాచ్ లు లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి…. పూణేలో 15 మ్యాచ్ నిర్వహించనున్నారు. ప్రతి జట్టు ముంబైలోని వాంఖడే అలాగే డీవై పాటిల్ స్టేడియంలో 4 మ్యాచులు ఆడనుంది. త్వరలోనే మ్యాచ్ ల షెడ్యూల్ను ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news