వేములవాడకు వీఐపీల రాక.. దర్శనంలో జాప్యంతో భక్తుల ఆగ్రహం

-

మహాశివరాత్రి వేళ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. నిన్న రాత్రి నుంచే క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజన్న దర్శనం కోసం రాత్రి 11 గంటల నుంచి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

మరోవైపు ఇవాళ రాజన్న ఆలయానికి వీఐపీలు పోటెత్తుతున్నారు. అధికారులు వీఐపీల కోసం సాధారణ భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సమయంతో సంబంధం లేకుండా వీఐపీలు వస్తున్న ప్రతిసారీ సాధారణ దర్శనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. పిల్లలతో గంటల కొద్దీ క్యూలైన్లలో ఉండాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన భక్తులు ఈవో డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news