కేసీఆర్‌ ప్రెస్‌ మీట్స్‌… అడల్ట్ సినిమాలను తలిపిస్తున్నాయి : ధర్మపురి అరవింద్

-

సీఎం కేసీఆర్‌ పై నిజామాబాద్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. కేసీఆర్ మీడీయా సమావేశాలు అడల్ట్ సినిమాలను తలిపిస్తున్నాయని… రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించమని విద్యుత్ చట్టంలో ఎక్కడా లేదు? అన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి కేసీఆర్.. బిజెపి ఎంపిలపై పదజాలాన్ని వాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ బి టీం “టీఆర్ఎస్ “ కాబట్టే ఈ రోజు విపక్ష పార్టీల సమావేశానికి టీఆర్ఎస్ హాజరయ్యిందన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి? డిమాండ్‌ చేశారు. రీ సైకిల్ బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు ఎఫ్.సి.ఐ కి అమ్ముతున్నారని… కర్నాటక నుండి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని తెచ్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూ వేల కోట్లు సంపాదిస్తున్నారని నిప్పులు చెరిగారు.

టీఆర్ఎస్ అండదండలతో మిల్లర్లు ఎక్కువ తరుగు తీసి రైతులకు అన్యాయం చేస్తున్నారని… ముఖ్యమంత్రి కేసీఆర్ ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్. తెలంగాణ లో పండే నాణ్యమైన బియ్యాన్ని ప్రైవేటుగా రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు గురించి మాట్లాడకుండా ఎదురుదాడి చేస్తున్నారని.. కేసీఆర్ కేంద్ర మంత్రుల పై మాట్లాడుతున్న భాష దుబాయి శేఖర్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్లకు సెన్సార్ బోర్డ్ 18ప్లస్ రేటింగ్ ఇవ్వాలని… తెలంగాణ సమాజం సిగ్గుపడేలా కేసీఆర్ భాష ఉందని ఫైర్‌ అయ్యారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన సమాచారాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news