మరో సమస్యలో ఇరుక్కున్న దిల్ రాజు..!!

-

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు  ఇప్పట్లో కష్టాలు వదిలేలా కనిపించడం లేదు.ఎన్నిరోజులగా కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్ డేట్స్ సంపాదించి , మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. దీనితో చిరంజీవి వాల్తేరు వీరయ్య, మరియు బాలయ్య బాబుల వీర సింహ రెడ్డి లు కూడా సంక్రాంతికి వస్తున్నాయి. దిల్ రాజు తమిళ్ నాడు పోతే ఇది తమిళ సినిమా అని తెలుగుకు వస్తే ఇది తెలుగు సినిమా అని పాట పడుతున్నాడు. దీనితో వారసుడు కు థియేటర్స్ ఇవ్వొదని తెలుగు నిర్మాతలు నోటీస్ పంపారు.

ఇదే ఇలా ఉండగా తాజాగా మరో ప్రాబ్లెమ్ ఎదురు అయ్యింది.ఈ సినిమాలో పర్మిషన్ లేకుండా జంతువులను వాడినందుకు జంతు పరిరక్షణ సమితి కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది. వారిసు సినిమాలో ఒక సీన్ లో ఎలిఫెంట్ ను ఉపయోగించారట.  జంతు పరిరక్షణ సమితి వారు పర్మిషన్ లేకుండా షూటింగ్ చేశారని, వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం నోటీసులు పంపారట. దీనితో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు అయ్యింది పరిస్థితి. ఇక ఈ సమస్యల నుంచి బయటపడటానికి దిల్ రాజు ఏమి చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news