డైరెక్టర్ బాబీ కి సూపర్ ఆఫర్ వచ్చిందా..!!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా తో  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి.

ఇప్పటికీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.తాజాగా 10 రోజులకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా దర్శకుడు బాబీ మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ కు మరో సినిమా చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారు రీసెంట్ గా బాలీవుడ్ కు వెళ్లి వచ్చిన విషయం తెలిసి టాలీవుడ్ నిర్మాత లను ఆశ్చర్య పరుస్తోంది . ఎప్పటి నుండో పాతుకు పోయిన వారి వల్ల కానిది రీసెంట్ గా వరసగా సినిమాలు నిర్మించడం చేస్తూ దూసుకు పోతున్నారు.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా దర్శకుడు బాబీ ని మంచి కథ రెడీ చేయమని చెబుతున్నట్లు సమాచారం అందుతోంది. దానికి బాబీ కూడా ఒకే చెప్పి  మంచి లైన్ చెప్పి , మిగిలిన పూర్తి కథ  తయారు చేసే పనిలో పడ్డాడట. మొత్తం సెట్ అయితే మాత్రం మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో జెండా పాతటం ఖాయంగా కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news