షర్మిల తెలంగాణలో తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దు – కడియం శ్రీహరి

-

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ బడ్జెట్ పై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ “కొత్త సీసా తీసుకొని హరీష్ రావు ఫామ్ హౌస్ కి వెళితే ఆయన మామ ఆ సీసాలో పాత సారా పోశారు” అంటూ సెటైర్లు వేశారు. షర్మిల వ్యాఖ్యలపై కడియం శ్రీహరి స్పందిస్తూ.. తెలంగాణలో తిరిగి షర్మిల తన సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు.

షర్మిల తన రాజకీయాన్ని ఆంధ్రకు మార్చుకోవాలని సూచించారు. వైయస్ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమేనని.. సమైక్యాంధ్ర నినాదంతో ఊరురా తిరిగిన వ్యక్తి షర్మిల అని కడియం తెలిపారు. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేశారని, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల కి రాజకీయంగా జగన్ అన్యాయం చేశాడని విమర్శించారు. షర్మిల ఆంధ్రకు వెళ్లి ప్రజలతో మొరపెట్టుకోవాలని సూచించారు. రేపో మాపో జగన్ మళ్ళీ జైలుకు వెళితే షర్మిలకి అవకాశం వస్తుందన్నారు కడియం.

Read more RELATED
Recommended to you

Latest news