డీకే అరుణ: అరెస్ట్ లతో బీజేపీని అణగదొక్కే కుట్ర.. కేసీఆర్ కు చిత్తశుద్ది లేదు!

-

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రాభవం కొంచెం కొంచెం పెరుగుతున్న కొద్దీ రాజకీయాలు మరింత ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వారికి వ్యూహాలను రచిస్తోంది. కాగా తాజాగా ఈ రోజు ఉదయం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను టెన్త్ హిందీ పేపర్ లీక్ సంబంధించిన వ్యవహారంలో కరీంనగర్ లోని తన ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి బీజేపీ నాయకురాలు డీకే అరుణ తనదైన శైలిలో BRS పై రెచ్చిపోయారు.

కేసీఆర్ ఎందుకో బీజేపీని చూసి భయపడుతున్నారన్నారు, ఇప్పటికే రాష్ట్రంలో విద్యావ్యవస్థను కూల్చేశారు… విద్యార్థుల భవిష్యత్తు గురించి కేసీఆర్ కు కొంచెం కూడా చిత్తశుద్ది లేదని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో బీజేపీని అడ్డు తొలగించుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. తమ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. కేసీఆర్ కు ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే అరెస్ట్ చేసిన బండి సంజయ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news