పెట్రోల్ ధరలు తగ్గించాలన్న సోయి కెసిఆర్ కు లేదు : డీకే అరుణ

-

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్న సోయి తెలంగాణ సిఎం కెసిఆర్ కు లేదని ఫైర్ అయ్యారు డీకే అరుణ. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గురువారం ఈ విషయం పై డీకే అరుణ హైదరాబాద్ లో పత్రిక ప్రకటన విడుదల చేసారు.

dk aruna
dk aruna

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కనీసం అభినందించకపొగా, తెరాస నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాట్ ను తగ్గించి వారి రాష్ట్ర ప్రజలకు భారం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే ,మన ముఖ్యమంత్రికి మాత్రం అసలు సోయి కూడా లేదని డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.

ఇన్ని రోజులు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గించాలంట్టు ప్రజల పై ప్రేమ ఉన్నట్లు నటించి, మోత్తుకున్న తెరాస నాయకులు ,ఇప్పుడు ఎక్కడ పారిపోయారు అని డీకే అరుణ ప్రశ్నించారు.ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టీ, ప్రజల శ్రేయస్సు కోసం పెట్రోల్ డీజిల్ ధరల పై వ్యాట్ ను తక్షణమే తగ్గించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news