నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ‘విడుదల రజినీ’ కిడ్నాప్..!

-

2024 ఏపీ ఎన్నికల వేళ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విడుదల రజిని అనే మహిళ స్వాతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దమైంది. దీంతో వైసీపీ నేత విడదల రజిని పేరు ఉండటంతో ఆమెకు ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఏర్పడింది.

దీంతో అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న సదరు మహిళను అక్కడి నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా తీసుకెళ్లారు. అయితే నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ అభ్యర్ధిని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. కాగా వైసీపీ నేతలు మాత్రం ఆ మహిళను టీడీపీ నే నామినేషన్ వేయించే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నారు. కాగా మహిళ కిడ్నాప్ వార్తలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను సమాచారం కనుగొన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news