దారుణం : డాక్టర్‌ను నిర్బంధించిన ఆసుపత్రి యాజమాన్యం..!

-

ఒక పక్క ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి హడలిపోతుంటే.. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌ లోని ఓ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను చాదర్‌ ఘాట్‌ లోని తుంబె ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని తెలిపారు.

అంత బిల్లు ఎందుకని అడిగినందుకు ఆ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్పందిస్తూ… సుల్తానా తమ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం పరీక్షలో సుల్తానాకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందన్నారు. కాగా ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పకుండానే ఆమె ప్రైవేటు ఆస్పత్రిలో చేరారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news