కీర్తి సురేష్ మొదటి పారితోషకం ఎంతో తెలుసా.. ఏంచేసిందంటే..?

-

సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. టాలీవుడ్ సినిమాలో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. ఈమె తల్లి మేనక హీరోయిన్ కాగా తండ్రి సురేష్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేష్ కి నిర్మాతలు తన రెమ్యూనరేషన్ ను కవర్లో పెట్టించి ఇచ్చే వారని కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

అయితే ఆ కవర్ను తన తండ్రికే ఇచ్చేదాన్నని తెలిపింది కీర్తి సురేష్.అలా సినిమాల ద్వారా వచ్చిన రెమినరేషన్ ను ప్రతిసారి తన తండ్రికే ఇచ్చానంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినప్పుడు తనకు మొదటి పారిపోషకం ఎంత ఇచ్చారో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. ఇప్పటికీ కూడా తనకు సినిమాల ద్వారా వచ్చే పారితోషకాన్ని ఆమె తన తండ్రికే ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ కాలంలో కూడా పారితోషికాన్ని తండ్రికి ఇస్తున్నారు అంటే నిజంగా కీర్తి సురేష్ గ్రేట్ అంటూ ఆమెపై పలువురు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె.. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ విందు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది. త్వరలోనే బాలీవుడ్ కి మకాం మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం కీర్తి సురేష్ కి సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news