జామ-అరటిపండు, ఆరెంజ్- క్యారెట్ కలిపి తింటున్నారా.. అయితే ఈ రోగాలకు మీరు వెల్కమ్ చెప్పినట్లే..!

-

పండ్లను తినటం ఆరోగ్యానికి మంచిదే..కాని ఏదిపడితే అది కలిపి తింటే అనారోగ్యానికి దారితీస్తాయి. మనం తినే పండ్లలో ఏది తింటే ఏంటి ప్రయేజనం అనే విషయం ముందుగా తెలిసి ఉండాలి. కొన్ని కొన్ని పండ్లు కొన్ని కొన్ని రోగాలకు ఔషధంలా పనిచేస్తే మరికొన్ని విషంలా పనిచేస్తాయి. అలానే కొన్ని పండ్లను కలిపి ఒకేసారి లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే కూడా తినకూడదు. అందులో ముఖ్యంగా జామ, అరటిపండు ఒకేసారి తినకూడదంట.

జామకాయ- అరటికాయ ఒకేసారి తినకూడదు. జామకాయను ఎక్కువగా షుగర్ పేషెంట్లు తింటూ ఉంటారు. అయితే జామ పండు తిన్న తర్వాత వెంటనే అరటి పండు తింటే కడుపులో తిప్పినట్లు అవుతుంది. తద్వారా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్​ సమస్యలు అధికంగా వస్తాయట. గ్యాస్ సమస్య అంటే దాదాపు గుండె నొప్పి అంత ప్రమాదకరమే..పైకి ఏమాత్రం కనిపించదు..కాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. అదే విధంగా పనస పండుని పాలతో పాటు తీసుకోకూడదు. చర్మ సమస్యలు వస్తాయట.

ఇంకా ఏం ఏం కలిపి తినకూడదో తెలుసుకుందాం..

ఎప్పుడైనా బొప్పాయి పండు తినేటప్పుడు నిమ్మరసం కానీ నిమ్మకాయను కానీ కలిపి తీసుకోవద్దట. ఇది చాలా ప్రాణాంతకమైంది. ఇలా తింటే ఎనిమియా సమస్యను కొని తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. హిమోగ్లోబిన్ లో కూడా సమస్యలు వస్తాయి. పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే విషయం తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇదే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణ రసాల్లో నిమ్మకాయ కంటే ఎక్కువ యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం కూడా ఉంది.

పుచ్చకాయ, కర్బూజ కూడా కలిపి తీసుకోకూడదనే విషయం మీకు తెలుసా. దీని వల్ల అజీర్తి సమస్యలు వస్తాయట. పండ్లలో ఆరెంజ్ ను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉంటారు. సీ విటమిన్ ఎక్కువగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పుల్లగా తియ్యగా భలే రుచిగా ఉంటుంది కదూ. అయితే ఈ పండుతో కలిపి క్యారెట్ ను అసలు తినకూడదు. అలా తినడం వల్ల గుండెలో మంట కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్నాయి కదా అని ఏదిపడితే అది ఒకేసారి తినకండి.

Read more RELATED
Recommended to you

Latest news