ఇంట్లో ఎవరైనా చనిపోతే శివాలయంలో ఎందుకు నిద్ర చెయ్యాలో తెలుసా?

-

మన హిందూ సాంప్రదాయలా ప్రకారం ఒక జీవి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మట్టిలో కలిసేంతవరకు ఎన్నో కార్యాలను చేస్తారు.ఉయ్యాల పంక్షన్ దగ్గర నుంచి చనిపోయిన తర్వాత పెద్ద ఖర్మ వరకూ అన్నీ సాంప్రదాయ ప్రకారం జరుగుతాయి.చనిపోయిన తర్వాత ఇంకా ఎన్నో కార్యాలు ఉంటాయి.అయితే ఇంట్లో ఎవరైనా చనిపోయిన పదకొండో రోజున కుటుంబ సభ్యులంతా వెళ్లి శివాలయ నిద్ర చేయాలంటారు. అలా ఎందుకు చేయాలో మనకు తెలియకపోయినప్పటికీ, శివాలయ నిద్ర చేసే ఉంటాం. అయితే అసలు అలా ఎందుకు చేయాలి, చేస్తే ఏం వస్తుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో ఎవరైనా కాలం చెల్లితే కొన్ని రోజుల వరకూ ఇంటి వారందరూ కకావిక స్థితిని అనుభవించాల్సిందే. ముఖ్యంగా ఇంటి పెద్ద చనిపోతే… యంత్రాంగం నడిపించే వారు లేక నానా అవస్థలు పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుడు చనిపోయాడనే బాధతో… వారి లోటును తీర్చుకోలేక తట్టుకోలేకపోతుంటారు. వారికి ఏం చేయాలి? ఎలా చేయాలి? చనిపోయిన వారు లేకుండా జీవితాన్ని ఎలా గడపాలనేది అర్థం కాక కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటారు. అయితే అలాంటప్పుడే పోయిన వారితో మనం పోదామనిపిస్తుంది.

అభద్రతా భావం హృదయాన్ని కుదించి వేస్తుంది. ఈ సమయంలో మనశ్శాంతి కోసం ఆత్మశక్తి కుదించి వేస్తుంది. శివాలయంలో ఒక్కరోజైనా ఉండి వస్తే ధైర్యం లభిస్తుందని పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత దొరుకుతుందని పండితులు చెబుతారు.అలా చేయడం వల్ల మనకు దేవుడు ఉన్నాడు.అనే భావన కలుగుతుంది.జీవితం మీద ఆశ కలుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి.అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడులే అనే భావన కలుగుతుంది.అందుకే కీడు జరిగిన ఇంట్లో ఖచ్చితంగా శివాలయ దర్శనం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news