ప్రధాని మోడీ పర్యటన.. ఈ రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!

-

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు ఉన్న ఐటీ కంపెనీలు తమ ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలని సూచించింది.

ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు

ఈ రూట్లల్లో ప్రయాణం..

గచ్చిబౌలి నుంచి లింగంపల్లి: గచ్చిబౌలి జంక్షన్ వద్ద మలుపు తీసుకోవాలి. బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా దవాఖానా, మజీద్ బండ కమాన్, హెచ్‌సీయూ డీపో రోడ్డు మీదుగా వెళ్లాలి.

విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి: క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్ రోడ్డు, హెచ్‌సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల రోడ్డు మీదుగా వెళ్లాలి.

కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్: జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్ రోడ్డు మీదుగా వెళ్లాలి.

Read more RELATED
Recommended to you

Latest news