సినిమా డైలాగులు కొట్టే వ్యక్తి రాజకీయాల్లో పనికొస్తాడా? – అంబటి రాంబాబు

-

టీడీపీ, జనసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. గురువారం జరిగిన వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకో బ్యాచ్, సైకిల్ బ్యాచ్ రెండు కలిసి సత్తెనపల్లి నేను నాశనం చేయాలనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిరాయి రౌడీల లాగా, కిరాయి పాలిటిక్స్ చేసే పార్టీ జనసేన పార్టీ అని ఆరోపించారు. గతంలో తాడేపల్లి ఆఫీసులో పవన్ కళ్యాణ్ కాపులను కించపరుస్తూ మాట్లాడానని.. నాకు కాపులకు మధ్య తగాదాలు పెట్టాలని దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హలో సినిమా డైలాగులు కొట్టే వ్యక్తి ఏపీ రాజకీయాలలో పనికొస్తాడా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంతవరకు తనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాగబాబు ఏమీ చేయలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news