న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

-

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు. జనవరి ఒకటవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. శనివారం రాత్రి రెండు గంటల వరకు వరకు చివరి ట్రైన్ ఉంటుందని హైదరాబాద్ మెట్రో పేర్కొంది.

మొదటి స్టేషన్ లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇక చివరి స్టేషన్ చేరేవరకు అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఇక తాగి మెట్రో లో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని మెట్రో అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news