జగన్ గురించి దేశం మొత్తం తెలిసిందా…?

-

ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జగన్ తప్పు చేసారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన లక్ష్యంగా వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేసారు. తన ట్విట్టర్ లో వర్ల రామయ్య మండిపడ్డారు.

“ముఖ్యమంత్రి గారూ! “సూది పోయిందని సోది అడిగితే, పాత బాగోతం బయటపడినట్లు”, మీరు ఢిల్లీకి పెద్ద లేఖ రాస్తే, తిరిగి, తిరిగి అది మీ మెడకే చుట్టుకుoది అని ఎద్దేవా చేసారు. మీ నేర చరిత్ర, మీ కేసుల చిట్టా, అరెస్ట్, 16 నెలల జైలు జీవితం, ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు, దేశమంతా పూస గుచ్చినట్లు తెలిసి పోయింది గదా? అని ఎద్దేవా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news