కిరణ్‌కుమార్‌ బీజేపీలో చేరితే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా ఓట్లు వేయరు – డొక్కా

-

కిరణ్‌కుమార్‌ బీజేపీలో చేరితే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు డొక్కా మాణిక్య వరప్రసాద్. కిరణ్ కుమార్ రెడ్డి బిజేపిలో చేరడం వలన వారికి ఒక్క ఓటు మాత్ర మే వస్తుందని నిప్పులు చెరిగారు డోక్కా మాణిక్య వరప్రసాద్.

కిరణ్ కుమార్ రెడ్డికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓట్లు వెయ్యరన్నారు. అలాంటి నాయకుడిని బిజేపి చేర్చుకోవడం వలన ఎలాంటి ఉపయోగం లేదని చురకలు అంటించారు. ప్రతిపక్షలు ఓటమిని అంగీకరించలేక దొంగ ఓట్లంటు ఆరోపణలు చేస్తూన్నాయని మండిపడ్డారు. ఎన్నికల ప్రకియ స్వతంత్ర వ్యవస్థ కలిగిన ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా నిర్వహిస్తూందన్నారు. ఒంటి మిట్ట రామాలయంలో జాంబవంతుడి విగ్రహాని టిటిడి ఏర్పాటు చెయ్యాలని కోరారు డొక్కా మాణిక్య వరప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news