ముస్లింల దగ్గర కూరగాయలు తీసుకోవద్దు; బిజెపి ఎమ్మెల్యే

-

 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరు కూడా తినడానికి తిండి దొరుకుతుందో లేదో అనే ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో మానవత్వం అనేది చాలా అవసరం అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాని కొందరి లో మాత్రం మానవత్వం ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు.

నటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఎదుటి వాళ్ళను ఆవేదనకు గురి చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కి చెందిన బిజెపి ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. సురేష్‌ తివారి అనే ఎమ్మెల్యే మంగళవారం ఒక వీడియో ని సోషల్ మీడియాలో విడుదల చేసారు. సదరు వీడియోలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ప్రజలెవ్వరూ కూడా ముస్లింల వద్ద కురగాయాలు, ఎలాంటి వస్తువలు గానీ కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేయడం గమనార్హం.

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తించడానికి కారణం కూడా ముస్లింలేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. కరోనా వ్యాప్తికి ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలే కారణమని ఆయన ఆరోపించడం గమనార్హం. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక వర్గాన్ని ఏ విధంగా నిందిస్తారు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక పక్క ప్రజల ప్రాణాలు పోతున్నా సరే బిజెపి నేతలు మాత్రం మారడం లేదని ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news