బిజెపి కార్యకర్తలను తక్కువ అంచనా వేయకండి – బండి సంజయ్

-

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈటెల రాజేందర్ ఇంకొకరికి హాని చేసే వ్యక్తి కాదని అన్నారు. హుజురాబాద్ లో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన గెలిచారని అన్నారు. అలాంటి వ్యక్తి కాన్వాయ్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పలివెలలో ఈటల మాట్లాడుతుండగా దాడి చేశారని.. సీఎం పైసలతో గుండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ కార్యకర్తలను తక్కువ అంచనా వేయకండని సూచించారు. ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలని.. మా సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు. ఇలాంటి వాటిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా ఉండాలన్నారు. ఏ అలజడి జరిగినా జిల్లా పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మీ ఉద్యోగాలు ఉండవు, మిమ్మల్ని ముఖ్యమంత్రి కూడా కాపాడలేడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news