వరకట్న వేధింపులు: రూ. 2 కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాడట.. !

-

మాములుగా పెళ్లి అయిన తర్వాత కష్టం కోసం వేధిస్తున్నాడని వరుడిపై కేసులు నమోదు అయ్యేవి. తాజాగా ఒక కేసు మాత్రం పెళ్ళికి ముందే కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం గత సంవత్సరం మార్చి 1వ తేదీన కంట్రీ క్లబ్ లో రోహిత్ డేవిడ్ పాల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థం కోసం అమ్మాయి తల్లితండ్రులు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈ నిశ్చితార్థం ప్రకారం గత జులై నెలలోనే వివాహం జరగాల్సి ఉంది. కానీ పెళ్లి కొడుకు పెళ్లి మాట ఎత్తితే చాలు పెళ్ళికొడుకు రోహిత్ మరియు అతని తల్లి అనిత.. అప్పుడు ఇప్పుడు అంటూ దాటేస్తూ వచ్చాడట. చివరికి రూ. 2 కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను అని యువతీ మరియు వారి కుటుంబ సభ్యులను వేధించాడట. ఇక వేధింపులు తట్టుకోలేక ఆ యువకుడు పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందట.

ఇక యువకుడు తల్లి డాక్టర్ గా పనిచేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు బంజారా హిల్స్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news