హైదరాబాద్​లో రూ.7 కోట్ల విలువైన బంగారు నగలతో డ్రైవర్ పరారీ

-

ఓ డ్రైవర్ రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఎంతో నమ్మకంగా ఉంటూనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చేపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ?

హైదరాబాద్​ మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న అనూష రూ.50లక్షల విలువచేసే ఆభరణాలను ఆర్డరు చేశారు. ఆమె శుక్రవారం సాయంత్రం మధురానగర్‌లో బంధువుల ఇంట్లో ఉన్నారు. తాను ఆర్డరు చేసిన నగలను అక్కడికే పంపమని చెప్పడంతో రాధిక తన కారులో డ్రైవర్‌ శ్రీనివాస్‌(28), సేల్స్‌మెన్‌ అక్షయ్‌(30)లతో వాటిని పంపారు.

మధురానగర్‌కు చేరుకున్నాక డ్రైవర్‌ కారులోనే ఉండగా.. అక్షయ్‌ ఇంట్లోకి వెళ్లి నగలను అనూషకు ఇచ్చి వెనుదిరిగారు. ఈలోపు డ్రైవర్‌ శ్రీనివాస్‌ కారుతో సహా పరారయ్యాడు. కారులో సిరిగిరిరాజ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లర్స్‌కు తిరిగి ఇవ్వాల్సిన రూ.7కోట్ల వజ్రాభరణాలు ఉన్నాయి. రాధిక ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రైవర్‌ శ్రీనివాస్‌ కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news