హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..!

-

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ తీవ్ర కలకలం రేపాయి. హైదరాబాద్​లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యులున్న ఓ ముఠాను ఆబ్కారీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ముగ్గురు ముఠా సభ్యుల దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎం, కొకైన్, గంజాయితో పాటుగా ఆశిష్ ఆయిల్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర మెడిసిన్ పేరుతో ఈ డ్రగ్స్‌ని తీసుకు వచ్చినట్లుగా తేలింది. ప్రధానంగా నిత్యావసర సరుకులు తీసుకువచ్చే లారీలో ఉండే క్లీనర్స్ ద్వారా వీటిని హైదరాబాద్‌ కు తీసుకు వచ్చారని విచారణలో బయట పడింది.

ఈ కేసులో అరెస్టైన భరత్ అనే వ్యక్తి బెంగళూరు, చెన్నై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలోని పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వ్యాపారవేత్తలకు అమ్ముతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో చిక్కిన భరత్ పలు పాత కేసుల్లోనూ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ముఠా గురించి పూర్తి విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news