దుబ్బాకలో ఒక్కసారిగా మారిన సీన్.. లీడింగ్ లో టీఆర్ఎస్ !

-

దుబ్బాక ఎన్నికల్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇప్పటిదాకా ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన బీజేపీని టిఆర్ఎస్ గత కొద్ది రౌండ్ల నుంచి వెనక్కి నెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా 19వ రౌండ్ పూర్తయ్యేసరికి ఒక్కసారిగా సీన్ మారిపోయింది. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 425 ఓట్ల ఆధిక్యతతో ముందు స్థానానికి వచ్చారు.

ఓవరాల్ గా ఆమె 251 వోట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ 53,053, బీజేపీ 52,802, కాంగ్రెస్ 18, 365 వోట్లు సాధించింది. ఇక 19వ రౌండ్ పూర్తయ్యేసరికి 138807 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రతుతానికి లక్షా అరవై నాలుగు వేల వోట్లకు గాను ఇంకా 22 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఈ నాలుగు రౌండ్స్ లో ఫలితం తేలిపోనుంది. చూడాలి మరో ఏమవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news