సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతి చెందారు. చెన్నైలో ఆయన మరణించారని సమాచారం అందుతోంది. గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన తెలుగులో సూర్య, అజిత్‌, మోహన్‌ లాల్‌, రాజ శేఖర్, విక్రమ్‌ ఇలా ఎంతో మంది స్టార్‌ హీరోలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news